భారతదేశం పేద దేశం కాదని ప్రధాని మోడీ అబిప్రాయపడ్డారు.దేశంలో ఇరవైవేల టన్నుల బంగారం ఉందని, అలాంటి దేశం పేద దేశం అవుతుందా అని ఆయన ప్రశ్నించారు. బంగారం డిపాజిట్ ,బాండ్ల స్కీమ్ ను ఆయన ప్రారంబించారు. దీని ద్వారా ప్రజలు నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని అన్నారు.ఇళ్లలో బంగారం దాచుకుంటే భద్రత ఉండదని, అదే బాండ్ల రూపంలో ఉంచుకుంటే ఆదాయం వస్తుందని,అలాగే భద్రత ఉంటుందని మోడీ అన్నారు.బాండ్లను ఎవరైనా దొంగిలించానా ప్రయోజనం ఉండదని ఆయన అన్నారు. మహిళల పేరుతో ఆస్తుల రిజిస్ట్రేషన్ జరగాలని ఆయన అన్నారు.
|
|
No comments:
Post a Comment